ముష్కరులు తెగబడితే ఎలా ఎదుర్కోవాలి? నేరస్తులు ఆయుధాలతో ఎదురుదాడికి దిగితే కట్టడి చేయడం ఎలా..? అనుమానిత వ్యక్తులను గుర్తించడం.. అదుపులోకి తీసుకోవడం… ఇలా వివిధ అంశాలపై సైబరాబాద్ పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుళ్లకు గత నెల నుంచి సీటీసీ మైదానంలో ఈ ట్రైనింగ్ ప్రారంభించారు. సంఘటనలు, సమస్యలు, సంఘ విద్రోహ చర్యలు, ఇతర విషయాలను సులభంగా పరిష్కరించడంతో పాటు క్రిమినల్స్ను దీటుగా ఎదుర్కొనేందుకు అవసరమయ్యే మెళకువలను వారం రోజుల పాటు నేర్పిస్తున్నారు. వీటితో పాటు ఆత్మైస్థెర్యాన్ని పెంచుకునేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు యోగా, వ్యాయామాలను కూడా చేయిస్తున్నారు. ఇప్పటివరకు మూడు బ్యాచ్ల్లో 298 మందికి ట్రైనింగ్ ఇచ్చారు.
అనుమానిత వాహనాన్ని రౌండప్ చేసి, అందులో ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం. ఇలా ఇంకా అనేక విషయాలపై కానిస్టేబుళ్లకు వారం రోజుల శిక్షణలో మెలుకువలను నేర్పించారు. శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండేందుకు అవసరమయ్యే వ్యాయామాలు, యోగా చిట్కాలు అందించారు. ఈ శిక్షణను సైబరాబాద్ కార్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్రాజ్, డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ ఇన్చార్జి రిజర్వు ఇన్స్పెక్టర్ సుమన్, స్పెషల్ పార్టీ ఆర్ఎస్ఐ ప్రదీప్, యూనిట్ డాక్టర్ సుకుమార్, బాంబ్ స్కాడ్ టీం శ్రీనివాస్, ఎంటీవో వెంకటస్వామి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ట్రైనింగ్ నిర్వహిస్తున్న అధికారులను సీపీ సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు
ఇవి నేర్పిస్తున్నారు..