హైదరాబాద్ : కూకట్పల్లి ఏటీఎం చోరీ ఘటనలో పాల్పంచుకున్న నిందితుల ఆచూకీని సైబరాబాద్ స్పెషల్ టాస్క్పోర్స్ పొలీసులు గంటల వ్యవధిలోనే గుర్తించారు.
చోరీ చేసిన సొత్తుతో నిందితులు బైక్పై సంగారెడ్డి నుంచి నాందేడ్ వైపు పారిపోతుండగా గుర్తించి పట్టుకున్నట్లు సమాచారం. వీరిని విచారణ నిమిత్తం కూకట్పల్లికి తీసుకువస్తున్నట్లు తెలిసింది.
కూకట్పల్లి పటేల్కుంట పార్కు సమీపంలో ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో గురువారం మధ్యాహ్నం సిబ్బంది డబ్బులు నింపుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు సిబ్బందిపై కాల్పులు జరిపి సొత్తుతో పరారయ్యారు.
కాల్పుల్లో ఏటీఎం వ్యాన్ సెక్యూరిటీ సిబ్బంది అలీ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. డబ్బులు నింపే వ్యక్తి చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.