హైదరాబాద్ : నగరంలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా ప్రత్యేక టాస్క్ఫోర్స్ పొలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం నుంచి హైదరాబాద్కు గంజాయిని తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు మియాపూర్ బీకే ఎన్క్లేవ్ వద్ద వాహనాన్ని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
దాదాపు 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలిస్తున్ననిందితులు శ్రీకాంత్, ఎల్లేశ్లను మియాపూర్ పోలీసులకు అప్పగించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి