అడ్డగుట్ట: అమావాస్య పుష్యమీ నక్షత్రం సందర్భంగా తుకారంగేట్ పహాడి హనుమాన్ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వెంకటరమణాచార్యులు మాట్లాడుతూ అంజనీపుత్రుడిని సింధూరం, తమలపాకులతో అలంకరించామని చెప్పారు. దీనితో పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం నిర్వహించామని అన్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచి, ఆంజనేయుడి ఆశీర్వాదాలు అందజేసినట్లు వివరించారు.