హైదరాబాద్ : ఈ నెల 19న గణేశ్ నిమజ్జనం సందర్భంగా జంట నగరాల పరిధిలో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) అధికారులు ప్రకటించారు. ఈ నెల 19న రాత్రి 10 గంటల నుంచి ఈ నెల 20 తెల్లవారుజాము 4:00 గంటల వరకు ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.
సికింద్రాబాద్-హైదరాబాద్ (19న 23:30 నుంచి ఈ నెల 21న 00:05 వరకు)
హైదరాబాద్-లింగంపల్లి ( 20న 00:30 నుంచి 01:20 వరకు )
లింగంపల్లి-హైదరాబాద్ ( 20న 01:50 నుంచి 02:40 వరకు)
హైదరాబాద్-సికింద్రాబాద్ ( 20న 03:30 నుంచి 04:00 వరకు)
హైదరాబాద్-లింగంపల్లి (19న 23:00 నుంచి 23:50 వరకు)
లింగంపల్లి-ఫలక్నుమా ( 20న 00:10 నుంచి 01:50 వరకు)
ఫలక్నుమా-సికింద్రాబాద్ (20న 02.20 నుంచి 03:40 వరకు)
సికింద్రాబాద్-హైదరాబాద్ (20న 04:00 నుంచి 04:40 వరకు)