రైల్వేలో మొదటిసారిగా సోయాబీన్ విత్తనాలను రవాణా చేశామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని మహారాష్ట్రలోని పర్బనీ నుంచి 2661 టన్నుల సోయాబీన్ విత్తనాలను రైలులో గుజరాత్లోని గాంధీనగర్కు రవాణా చేశామన్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా నాందేడ్ డివిజన్ రైల్వే అధికారులను అభినందించారు. రైలు ద్వారా సరుకుల రవాణాఎంతో భద్రతతో కూడుకున్నదే కాకుండా ఎంతో వేగంగా గమ్యస్థానాలను చేరవేసే అవకాశం ఉందని, దీన్ని మరింతగా విస్తరించాలని ఆయన రైల్వే అధికారులకు సూచించారు.