కొవిడ్-19 సెకండ్ వేవ్ అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో లాలాగూడలో ఉన్న రైల్వే సెంట్రల్ హాస్పిటల్ పలు కేటగిరి పోస్టులకు తాత్కాలిక పద్ధతిన భర్తీ చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణ యం తీసుకుంది. ఇందులో నర్సింగ్ సూపరింటెండెంట్, ల్యాబ్ అసిస్టెంట్, హాస్పిటల్ అటెండెంట్ వంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పని చేసిన వారు లేదా మాజీ రైల్వే ఉద్యోగులు, ఇతర సాధారణ అభ్యర్థులు కూడా ఈ పోస్టుల కోసం దరఖాస్తు లు చేసుకోవడానికి ఎస్సీఆర్ అవకాశం లిక్పంచింది. ఆసక్తి గలవారు ఈ నెల 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. పోస్టులు, జీతాలు, విద్యార్హతలు, అనుభవం, వ యసు పూర్తి వివరాల కోసం www.scr.indianrailways.gov.in వెబ్సైట్ను సం ప్రదించాలన్నారు.