సిటీబ్యూరో, జూలై 12 (నమస్తే తెలంగాణ) : కాచిగూడ, విశాఖపట్నం, లింగంపల్లి స్టేషన్ల మధ్యలో పలు రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తూ సోమవారం దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి పలు రైళ్లు రాకపోకలు కొనసాగించనున్నాయి. అలాగే విశాఖపట్నం, కడప, ధర్మవరం, శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం స్టేషన్ల మధ్యలో కూడా రైళ్ల రాకపోకలను ప్రారంభించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో గతంలో నిలిచిపోయిన పలు ప్రత్యేక రైళ్లను ఈ నెల 17 నుంచి పునరుద్ధరించనున్నారు.