సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : కరోనా ప్రభావం రైళ్లపై బాగా పడింది. రద్దీ లేకపోవడంతో సికింద్రాబాద్- విజయవాడ, సికింద్రాబాద్-బీదర్, సికింద్రాబాద్ నుంచి కర్నూల్ సిటీ, సిర్పూర్ కాగజ్నగర్, గుంటూరుతో కలిపి మొత్తం 27 రైళ్ల రాకపోకలను పదిహేను రోజుల వరకు రద్దు చేసినట్లు ఆదివారం దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాగా, దేశ వ్యాప్తంగా పలు రాష్ర్టాలకు కలిపి ఆదివారం వరకు 21,392 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను తమ ప్రత్యేక ఎక్స్ప్రెస్ల ద్వారా సరఫరా చేశామని ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ల రాకపోకల కోసం గ్రీన్ కారిడార్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.