బంజారాహిల్స్,సెప్టెంబర్ 8 : ఫిలింనగర్లోని బీజేఆర్నగర్ బస్తీలో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు. బీజేఆర్నగర్కు చెందిన పలువురు టీఆర్ఎస్ నేతలు, బస్తీనాయకులు బుధవారం ఎమ్మెల్యే దానం నాగేందర్ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
బస్తీలో బాబూ జగ్జీవన్రామ్ కమ్యూనిటీహాల్ నిర్మించాలని, ఎన్నో ఏండ్లుగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ దవాఖాన నిర్మాణం చేపట్టాలని కోరారు. బస్తీలో ఓపెన్నాలాపై శ్లాబ్ వేయించాలని, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కోరారు. బస్తీలలో వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, జీహెచ్ఎంసీ సిబ్బంది సరైన స్పందన చూపడం లేదని ఫిర్యాదు చేశారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా కారణంగా కొన్ని పనులు పెండింగ్లో పడ్డాయని, త్వరలోనే అన్ని పనులను పూర్తిచేయించే బాద్యత తనదే అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో బీజేఆర్నగర్ బస్తీ నేతలు నడిమింటి కృష్ణ, బి.దామోదర్, డి.ఎల్లయ్య, చంద్రశేఖర్, యాదయ్య, కోట రాములమ్మ, భాగ్యమ్మ, విజయలక్ష్మి తదితరులున్నారు.