11న తుది ఓటర్ల జాబితా
అదే ప్రక్రియలో డివిజన్ల రిజర్వేషన్లు
ఈ నెల 15 నుంచి ఎప్పుడైనా నోటిఫికేషన్
వేగంగా ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం
వరంగల్, ఏప్రిల్ 5(నమస్తేతెలంగాణ ప్రతినిధి): గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు త్వరలో నగారా మోగనుంది. ఇప్పటికే డివిజన్ల పునర్విభజన పూర్తికాగా ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ వెలువడడంతో పాటు నెలాఖరులోగా ఎన్నికలుంటాయని తెలుస్తుండగా ఆ మేరకు అధికారయంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 11న ఓటర్ల తుది జాబితా విడుదల చేసి దీని ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయనుంది. ఇదిలా ఉంటే హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన గ్రేటర్ వరంగల్ టీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధికి నోచుకుని కొత్తరూపును సంతరించుకుంది.గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల ఏర్పాట్లు ఊపందు కుంటున్నాయి. ఈ నెల 15 తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రానుండడంతో ఓటర్ల జాబితా, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చకాచకా సాగుతోంది. నెలాఖరులోనే ఎన్నికలుంటాయని చెబుతున్న అధికారులు.. ఈమేరకు సంబంధిత పనులపై దృష్టి పెట్టారు. గతంలో 58 డివిజన్లు ఉండగా పునర్విభజన తర్వాత వాటి సంఖ్య 66కు పెరిగింది.
డివిజన్లవారీగా తుది ఓటర్ల జాబితాను ఈ నెల 11న ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయగా దీనికనుగుణంగా ఏర్పా ట్లు చేస్తున్నారు. అలాగే డివిజన్ల వారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట ర్ల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. ఇంటింటికీ వెళ్లి ఈ నెల 7లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికార యం త్రాంగం నిమగ్నమైంది. పూర్తయిన వెంటనే ఓటర్ల జాబితాను వెల్లడి స్తారు. దీని ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఆ త ర్వాత ఎన్నికల నిర్వహణ కోసం షెడ్యూల్ విడుదల కానుం ది. షెడ్యూల్లోనే ఎన్నికల నోటిఫికేషన్, పోలింగ్ తేదీ, ఓట్ల లెక్కింపు తేదీలను ప్రకటించనుంది. గ్రేటర్ వరంగల్ పాలక వర్గం గడువు మార్చి 14తో ముగిసింది. పెరిగిన జనాభాక నుగుణంగా డివిజన్ల పునర్విభజన ప్రక్రియ చేపట్టడంతో గడు వులోగా ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. పునర్విభజ న పూర్తి కాగానే ఎన్నికల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.
టీఆర్ఎస్తోనే మహానగరానికి గుర్తింపు..
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపుపై టీఆర్ఎస్ ధీమాగా ఉంది. వరంగల్ను మహానగరంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దే. రాష్ట్రంలో వరంగల్ మహానగరానికి గొప్ప గుర్తింపు లభించిం ది. చారిత్రక నగరాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరున్నరేండ్లలో ఎంతో అభివృద్ధి చేసింది. గ్రేటర్ వరంగల్ పాలకవర్గం కొలు వుదీరిన 2016 నుంచి ఐదేండ్లలో ఏకంగా రూ.1416 కోట్ల తో పనులు చేపట్టింది. మున్సిపల్ మంత్రి కేటీఆర్ పర్యవే క్షణతో మహానగరంలో అవసరమైన మౌలిక సదుపాయల కల్పన పూర్తయ్యింది. గ్రేటర్ వరంగల్లోని 183 స్లమ్స్, 42 విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. రూ.300 కోట్లతో విలీన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైపులైను, వీధి దీపాలు వంటి మౌలిక వసతులు కల్పించారు. 407.77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నగరంలో ప్రతి మూల అభివృద్ధి పనులు జరుగుతూనే ఉన్నా యి.
ఎస్సీ సబ్ ప్లాన్ కింద గ్రేటర్ వరంగల్లో రూ.33 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. స్మార్ట్రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, జంక్షన్ల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి జరిగింది. ఉగాది నుంచి ఇంటింటికీ ప్రతి రోజూ సురక్షిత తాగునీరు సర ఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. పట్టణ ప్రగతి నిధులతో మౌలిక వసతుల కల్పనతోపాటు పారిశుధ్య నిర్వ హణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఫలితంగా వరంగల్ పరిశుభ్ర నగరంగా మారుతోంది. ఇలా అన్ని రకాలుగా చేపట్టి న పనులతో గ్రేటర్ వరంగల్ ఇప్పుడు సరికొత్తగా మారింది. చేసిన అభివృద్ధి కండ్ల ముందు కనిపిస్తుండడంతో ప్రజల మ ద్దతు పొందేలా ఎన్నికల కార్యాచరణ ఉండాలని సీఎం కేసీఆ ర్.. నగరంలోని టీఆర్ఎస్ కీలక ప్రజాప్రతినిధులకు సూచిం చారు. కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందేలా పనిచేయాలని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీలో 24 గంటలు పని చేయనున్న కరోనా టీకా కేంద్రాలు
మావోయిస్టు కమాండర్ హిడ్మా లక్ష్యంగా ఆపరేషన్ ప్రహర్-3