సిటీబ్యూరో, జూలై 17(నమస్తే తెలంగాణ): కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలను ఆదుకునేందుకు సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకొచ్చింది. హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 19 మంది పిల్లలను గుర్తించి 10వ తరగతి వరకు చదివిస్తామని బాధ్యత తీసుకుంది. ఇందులో నలుగురు పిల్లల చదువు ఖర్చుకు సంబంధించిన చెక్కును ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, సైబరాబాద్ షీ టీమ్స్ డీసీపీ అనసూయ, ఎస్సీఎస్సీ ప్రతినిధులు మహిళ,శిశు సంక్షేమశాఖ కమిషనర్ దివ్యదేవరాజన్కు అందించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో అనాథలైన పిల్లలందరినీ గుర్తించి వారిని పదోతరగతి వరకు చదివిస్తామని ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల తెలిపారు.