సేవ చేయాలనే మనసు కొందరికే ఉంటుంది. ఆ కోవాకు చెందిన వారే.. మురళి. కొవిడ్తో బాధపడుతున్న వారికి సాయంగా నిలువాలన్న లక్ష ‘మారి’ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశాడు. 50మంది సభ్యులతో నగరంలోని ప్రధాన దవాఖానల్లో రోగులకు సేవలందజేస్తున్నారు. కొవిడ్ రోగులు ఆత్మైస్థెర్యం కోల్పోకుండా ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్ ఇవ్వడమే కాకుండా.. హెల్ప్డెస్క్, హెల్స్ లైన్ ఏర్పాటు చేసి నిత్యావసర సరుకులు సైతం అందజేస్తూ.. మేమున్నామంటూ.. భరోసా కల్పిస్తున్నారు.
బడంగ్పేట, మే 30 : ఈ అపత్కాలంలో ఆదుకోవడమే లక్ష్యంగా సేవా హస్తం అందిస్తున్నది ఓ స్వచ్ఛంద సంస్థ. సెకండ్ వేవ్తో అవస్థలు పడుతున్న కొవిడ్ రోగులకు వెన్నంటి ఉండి..ఆదుకుంటున్నది. మేమున్నామే భరోసా ఇస్తున్నది. ఆత్మైస్థెర్యం కోల్పోకుండా అభయమిస్తున్నది. బాధితుల ఇంటికి వెళ్లి.. మెడికల్ కిట్స్, నిత్యావసర సరుకులు అందజేస్తున్నది. ఇలా కష్టకాలంలో అసమాన సేవలందిస్తూ.. మానవత్వాన్ని చాటుకుంటున్న ‘మారి’ సంస్థ ఎందరికో స్ఫూర్తినిస్తున్నది.
కొవిడ్ రోగులకు సేవలందించేందుకు మారి సంస్థలో 50 మంది పనిచేస్తున్నారు. ఉస్మానియా, కింగ్కోఠి, ఎర్రగడ్డ చెస్ట్దవాఖాన, కిమ్స్, గాంధీ వైద్యశాలల్లో సంస్థ ఆధ్వర్యంలో హెల్ప్డెస్క్లను నెలకొల్పారు. సభ్యులు ప్రజలు, వైద్యులకు మధ్య వారధిగా ఉంటూ.. సహాయసహకారాలు అందిస్తున్నారు. అవసరమైన వారికి ఇంటికి వెళ్లి..నిత్యావసర సరుకులు, మెడికల్ కిట్లు అందిస్తున్నారు.
బాలాపూర్, సరూర్నగర్, ఉప్పల్, మన్సూరాబాద్, అడ్డగుట్ట, బైబిల్ హౌజ్, ముసీరాబాద్, నారపల్లి ప్రభుత్వ దవాఖానల్లోనూ సంస్థ సభ్యులు పనిచేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దవాఖానలో సేవలు అందిస్తున్నారు. అలాగే పేద రోగులకు ఆక్సిమీటర్, థర్మా మీటర్, మందులు అందజేస్తున్నారు. కొవిడ్ పేషంట్స్ ఆత్మైస్థెర్యం కోల్పోకుండా కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఎప్పుకప్పుడు ఏ ముందులు వేసుకోవాలో తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
మారి సంస్థ సేవా దృక్పథంతో పనిచేస్తున్నది. వేలాది మంది కొవిడ్ రోగులకు చేయుతనిస్తున్నాం. మూడు నెలల నుంచి హెల్ప్డెస్క్, హెల్స్ లైన్ ఏర్పాటు చేసి.. సేవలందిస్తున్నాం. ఇప్పటి వరకు పదివేల మందికి నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు, దుస్తువులు, దుపట్లు తదితర సరుకులు అందజేశాం. సంస్థ సభ్యులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నాం. -మురళీ, మారి సంస్థ నిర్వాహకుడు