సిటీబ్యూరో, మే 18(నమస్తే తెలంగాణ): ఆకలితో అలమటిస్తున్న ఇద్దరు చిన్నారులకు తన లంచ్బాక్స్ అందించి వడ్డించి అన్నం పెట్టిన కానిస్టేబుల్కు ప్రశంసలు దక్కుతున్నాయి. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్.మహేశ్ కుమార్ సోమవారం మధ్యాహ్నం సోమాజిగూడ రోడ్డులో వెళ్తుండగా ఇద్దరు పిల్లలు అన్నం కావాలంటూ అడుగుతుండగా వెంటనే తన ద్విచక్రవాహనాన్ని ఆపి, బ్యాగ్లో ఉన్న టిఫిన్ బాక్సులోని అన్నం తీసి ఆ పిల్లలకు తిన్పించిన విషయం తెలిసిందే. ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. మహేశ్ను కొనియాడుతూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆ కానిస్టేబుల్ను మంగళవారం కార్యాలయానికి పిలిపించి జ్ఞాపిక ఇచ్చి అభినందనలు తెలిపారు.