సిటీబ్యూరో, జూన్ 27 : ఉస్మానియాలో దవాఖానలో ఏర్పాటైన తెలంగాణలోని తొలి స్కిన్ బ్యాంకును సోమవారం హోం మంత్రి మహమూద్ అలీ, హెటిరో చైర్మన్ డాక్టర్ బీపీఎస్రెడ్డి, రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ -3150 గవర్నర్ ఎన్వీ హన్మంత్ రెడ్డి, ప్రభుత్వ వైద్య కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ బి.నాగేందర్తో కలిసి ప్రారంభించనున్నారు. రూ.60 లక్షల వ్యయంతో హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఈస్ట్ సహకారంతో దవాఖానలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఈ స్కిన్ బ్యాంకును ఏర్పాటు చేశారు.