సిటీబ్యూరో, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ: ఖైత్లాపూర్ నుంచి హఫీజ్పేట మధ్య వేధిస్తున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడింది. నిత్యం రద్దీగా ఉండే కేపీహెచ్బీ-7 ఫేజ్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన సిగ్నల్స్ను గురువారం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ట్రాఫిక్ జామ్ ఏర్పడే కూడళ్లను గుర్తించి.. సిగ్నల్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు, కూకట్పల్లి ఇన్స్పెక్టర్లు నర్సింహరావు, క్రాంతి, మాదాపూర్ ఇన్స్పెక్టర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.