మణికొండ : శ్రావణమాస బోనాల ఉత్సవాలు గౌలిదొడ్డి గ్రామంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఊరేగింపుగా బోనాలతో బయలుదేరిన గ్రామస్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి దీప,దూపనైవేద్యాలను సమర్పించడంతో పాటు ప్రత్యేక పూజలను నిర్వహించారు.
వట్టినాగులపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు జి.నాగేశ్యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం గౌలిదొడ్డిలో నిర్వహించిన బొనాల ఉత్సవాలలో నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలంటూ అమ్మవారికి మొక్కులు చెల్లించినట్లు మాజీ ఎంపీటీసీ సభ్యుడు నాగేశ్యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ భగవాన్సింగ్,స్థానిక నాయకులు పాల్గొన్నారు.