శంషాబాద్, జూన్ 16 : శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రత కోసం కొవిడ్ నిబంధనలు పాటించడం ప్రధానంగా మారింది. ఎంట్రీ చెకింగ్, సెక్యూరిటీ, ఇమ్మిగ్రేషన్స్ వద్ద క్యూ నిర్వహణ, రద్దీ నివారణ, భద్రత కీలకంగా మారిన నేపథ్యంలో ప్రయాణికుల సౌలభ్యం కోసం కృత్రిమ మేధ, వీడియో అనలిటిక్స్ ద్వార శంషాబాద్ ఎయిర్పోర్టులో రద్దీ నివారణకు అత్యాధునిక క్యూమేనేజ్మెంట్ వ్యవస్థను అమలులోకి తీసుకొచ్చినట్లు బుధవారం జీఎంఆర్ కమ్యూనికేషన్ అధికార వర్గాలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎయిర్పోర్టు సీఈఓ ప్రదీప్ ఫణికర్ మాట్లాడుతూ విమానయానం చేయడంలో ప్రయాణికుల్లో విశ్వాసం పెంపొందించేందుకు తాజాగా ఆల్గోవిజన్ భాగస్వామ్యంతో అత్యాధునిక వ్యవస్థ అమలు చేయడం తమకు సంతోషంగా ఉందని తెలిపారు. ఆల్గోవిజన్ సీఈఓ శ్రీనివాసన్ మాట్లాడుతూ హైదరాబాద్ ఎయిర్పోర్టులో విజయవంతంగా అమలు చేయడంలో సహకారం అందించిన జీఎంఆర్ గ్రూప్కు కృతజ్ఞతలు తెలిపారు.