న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ కోసం సింధు సన్నద్ధతకు కేంద్ర క్రీడాశాఖ మద్దతుగా నిలిచింది. గాయం నుంచి త్వరగా కోలుకునేందుకు అత్యుత్తమ సదుపాయాలను సమకూర్చుకునేందుకు కావాల్సిన మొత్తానికి క్రీడాశాఖ 24 గంటల వ్యవధిలో అనుమతిచ్చింది. దీనిపై సింధు శుక్రవారం స్పందిస్తూ ‘రికవరీ సిస్టమ్ కోసం అయ్యే ఖర్చుకు సాయ్ రోజు వ్యవధిలో అనుమతివ్వడం సంతోషంగా ఉంది. ఈ డబ్బులతో కావాల్సిన పరికరాల కోసం ఆర్డరిస్తాను’ అని అంది. ఫిట్నెస్ పరంగా మెరుగ్గా ఉండటంతో పాటు తొందరగా కోలుకునేందుకు ఇది ఉపయోగపడనుంది.