కిటకిటలాడిన దేవాలయ పరిసరాలు
సుమారు లక్ష మంది రాక
స్వామి నామస్మరణతో పులకించిన ఐనవోలు
పట్నాలు వేసి, బోనం వండి, నైవేద్యం సమర్పించి మొక్కులు
ఐనవోలు, ఏప్రిల్ 4: మల్లన్న నామస్మరణలో ఐనవోలు పులకించింది. ఐనవోలు మల్లికార్జునస్వామి దేవాలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉగాది పండుగకు ఒకే వారం ఉండడంతో భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. శనివారం రాత్రి ఆలయానికి చేరుకొని విడిది చేశారు. ఆదివారం వేకువజామునే స్వామి వారికి ఒగ్గు పూజారుల మేల్కొలుపు తర్వాత ఉదయం 6 గంటల నుంచే దర్శనం కల్పించారు. ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష అభిషేకాలు, కల్యాణం నిర్వహించి రుద్రాభిషేకాలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పట్నాలు వేసి, బోనం వండి స్వామి వారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఒగ్గు పూజారులు పట్నాలు వేశారు. ఈ 12వ వారాంతపు జాతరకు సుమారు లక్ష మంది భక్తులు వచ్చారని ఆలయ అధికారులు పేర్కొన్నారు.
ఇవి కూడా చూడండి..
వేదాంత కెయిర్న్తో జగడం.. లాభాల రికవరీకి కేంద్రం నోటీసు