చార్మినార్, జూన్ 22: ఉపాధి కల్పన కోసం శిక్షణ అందించే సెట్విన్ కేంద్రం ఆధ్వర్యంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణుగోపాల్రావు మంగళవారం వెల్లడించారు. నగర వ్యాప్తంగా సెట్విన్ సంస్థ నిర్వహిస్తున్న 24 కేంద్రాలతోపాటు మరో 54 ఫ్రాంఛైజీల ద్వారా వివిధ అంశాల్లో శిక్షణ కల్పించనున్నట్లు తెలిపారు.అదే సమయంలో ఆన్లైన్లో రొబొటిక్, సివిల్ ఆటోకాడ్, 3డీ ప్రింటింగ్,ఏఐ, ఎంఎల్ లాంటి కంప్యూటర్ ఆధారిత కోర్సులను విద్యార్థులకు అందించనున్నామని తెలిపారు. విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్రావు సూచించారు.