జూబ్లీహిల్స్,జూన్ 4: పేదవారి కళ్లల్లో ఆనందం.. వారి కుటుంబాల్లో కల్యాణ కాంతులు చూడటమే సీఎం కేసీఆర్ లక్ష్యమని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు. యూసుఫ్గూడలోని సవేరా ఫంక్షన్ హాల్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 83 మంది లబ్ధిదారులకు రూ. 83,09,628 విలువజేసే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలందరికీ ఈ వినూత్న పథకాన్ని అందజేయడం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. గతంలో ఆడపిల్ల పెండ్లి చేయాలంటే తల్లిదండ్రులు ఆందోళన చెందారని, సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలతో ఇప్పుడు సంతోషంగా వివాహాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాజ్కుమార్ పటేల్, సీఎన్ రెడ్డి, సంగీత యాదవ్, దేదీప్య విజయ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
షేక్పేట్, జూన్ 4: టోలిచౌకి ఎంఎఫ్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో సూపర్స్ప్రెడర్స్కు ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ కేంద్రాన్ని శుక్రవారం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. షేక్పేట్ డివిజన్ పరిధిలోని స్ప్రెడర్స్కు వేస్తున్న వ్యాక్సిన్ కార్యక్రమం తీరుపై ఆయన పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నారనీ, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు.