శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం దేవాలయంలో అత్యంత వైభవంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ తలంబ్రాలు, ప్రసాదాన్ని పోస్టు ద్వారా అందించనున్నట్లు తపాలా అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.300లను చెల్లించి ఆన్లైన్లో telanganapostalcircle. in/eshop ద్వారా, లేదా దగ్గరలోని పోస్ట్ ఆఫీస్ నుంచి బుక్ చేసుకోవాలని, ఆన్లైన్లో/పోస్ట్ ఆఫీస్లో బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 2021 ఏప్రిల్ 19వ తేదీన ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి 2021 ఏప్రిల్ 30న శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవ ప్రసాదాన్ని అందించడం జరుగుతుందని పోస్టల్ ఇండియా పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ యేసురత్నం పేర్కొన్నారు.