హైదరాబాద్ : సికింద్రాబాద్లో జులై 12వ తేదీన నిర్వహించే జగన్నాథ రథయాత్రను రద్దు చేస్తున్నట్లు శ్రీ జగన్నాథ స్వామి రామ్గోపాల్ ట్రస్టు ప్రకటించింది. కొవిడ్ కారణంగా ఈ ఏడాది కూడా రథయాత్రను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రథయాత్ర రద్దు కావడం వరుసగా ఇది రెండోసారి. సికింద్రాబాద్ జనరల్ బజార్లో 130 ఏండ్ల నుంచి క్రమం తప్పకుండా జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగానే రథయాత్రను రద్దు చేశామని, భక్తులంతా తమ నివాసాల్లోనే ఉండి ప్రార్థనలు చేసుకోవాలని ట్రస్టు సభ్యులు కోరారు.