సిటీబ్యూరో, ఆగస్టు 21 ( నమస్తే తెలంగాణ ): శ్రీ గణపతి నవరాత్రులను పురస్కరించుకుని సికింద్రాబాద్ శ్రీ గణేశ్ ఆలయ సేవలను ఆన్లైన్లోనూ అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చీఫ్ పోస్ట్మాస్టర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలయానికి రాలేని భక్తులు ఈ సేవలను ఉపయోగించుకోవచ్చని సూచించారు. ఈ సేవలు సెప్టెంబర్ 10 నుంచి 20 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. లక్షభిల్వార్చన, కల్యాణం, సత్యగణపతి వ్రతం, సర్పదోష నివారణ అభిషేకం, కాలసర్పదోష నివారణ అభిషేకం సేవలు ఉంటాయని వివరించారు. పూజా అనంతరం ప్రసాదం చిరునామాకు చేరుతుందని తెలిపారు. ఈ సేవలను స్థానిక పోస్టాఫీసులు లేదా పోస్టల్ ఈ కామర్స్ వెబ్సైట్లోనూ పొందొచ్చని చెప్పారు. సేవల ఆధారంగా రూ.300 నుంచి రూ.620 వరకు చార్జీ ఉంటుందని అన్నారు.