కోల్కతా: దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. రైళ్ల ద్వారా రాష్ట్రంలోకి వస్తున్న ప్రయాణికులు 72 గంటల ముందే ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, అందులో నెగెటివ్ అని తేలితేనే అనుమతిస్తామని ఆదేశాలు జారీచేసింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. కరోనా కట్టడికి పశ్చిమబెంగాల్ తోపాటు పలు రాష్ట్రాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. రైళ్లలో ఎక్కే ప్రయాణికులకు థర్మల్ స్కానింగ్ చేయాలని, ఆర్టీపీసీఆర్ నెగిటివ్ నివేదిక ఉన్న వారినే రైళ్లలోకి అనుమతించాలని శాఖ కార్యదర్శి హెచ్ కే దివేది రైల్వే ఉన్నతాధికారులకు రాసిన లేఖలో కోరారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,21,872 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి