కంటోన్మెంట్, జూలై 20: బోర్డు పరిధిలోని ఏడో వార్డు తిరుమలగిరి ప్రధాన రహదారిపై ఉన్న మహాత్మాగాంధీ కమ్యూనిటీ హాల్లో నిర్వహిస్తున్న డంపింగ్ యార్డును అక్కడి నుంచి తరలించాలని ఎమ్మెల్యే సాయన్న అన్నారు. ఈ మేరకు పలు అంశాలకు సంబంధించి మంగళవారం టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు, బ్రిగేడియర్ అభిజిత్ చంద్రను కలిసి వినతిపత్రం అందించారు. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా మూసివేసిన రోడ్లను తెరిపించడంతో పాటు, లాల్బజార్లో ఉన్న శ్రీఆంజనేయ స్వామి ఆలయంను తెరవాలని కోరారు. సానుకూలంగా స్పందించిన బ్రిగేడియర్ సీఈఓతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథం, భాగ్యశ్రీ, నళినికిరణ్, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.