కంటోన్మెంట్, జూలై 13: కేంద్ర ప్రభు త్వం నూతనంగా దేశ వ్యాప్తంగా ఉన్న కం టోన్మెంట్ బోర్డుల పరిధిలో క్లార్-2021(కంటోన్మెంట్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్) బిల్లును ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోందని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెం ట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఈ క్రమంలో కంటోన్మెంట్లోని బీ3 స్థలాల్లో నివాసముంటున్న వేల కుటుంబాలకు క్లార్-2021 వల్ల తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉందన్నారు. క్లార్-2021 కు సంబంధించిన ప్రజల నుంచి సందేహాలను, సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరగనున్న డిఫెన్స్ కమిటీ సమావేశానికి హాజరుకానున్న టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావును మంగళవారం మర్రి రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు భేటీ అయ్యారు. భేటీలో భాగంగా క్లార్-2021కు సంబంధించి ప్రజాభిప్రాయాన్ని వెలిబుచ్చే గడువును మరో మూడు నెలల పాటు పొడిగించే విధం గా చొరవ తీసుకోవాలని ఎంపీ కెఫ్టెన్ లక్ష్మీకాంత రావు కు వినతిపత్రాన్ని అందించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కెఫ్టెన్ లక్ష్మీకాంత్రావు కచ్చితంగా డిఫెన్స్ కమిటీ సమావేశంలో గడువు పొడిగించే విధంగా చూడటమే కాకుండా, కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని అంశాలను ప్రస్తావిస్తానని వ్యాఖ్యానించారు.
అనంతరం మర్రి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ కంటోన్మెంట్లోని బీ3 స్థలాల్లో సుమారు ఐదువేల మంది పేదలకు నివాస గృహాలు ఉన్నాయని, వీటితో పాటు ఓల్డ్ గ్రాంట్ బంగ్లా లు ఉండటంతో ప్రస్తుతం కేంద్ర తీసుకువచ్చే క్లార్-20 21 వల్ల తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉందన్నారు. కరో నా కారణంగా ప్రభుత్వానికి వినతులు ఇచ్చే పరిస్థితి లేదని, దీన్ని దృష్టిలో ఉంచుకుని 90 రోజుల పాటు ప్రజల నుంచి సూచనలు స్వీకరించే విధంగా గడువును పొడిగిస్తే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు లోక్నాథ్, పాండుయాదవ్, నళినికిరణ్, ప్రభాకర్, శ్యామ్ కుమార్లు పాల్గొన్నారు.