హైదరాబాద్, జూలై 23 (నమస్తేతెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి దంపతులు శుక్రవారం బెజవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థాన అర్చకులు, ఈవో భ్రమరాంబ, పూర్వపు ఈఓ కోటేశ్వరమ్మ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న వారు.. ఆషాఢం సారె సమర్పించి మొకులు తీర్చుకున్నారు. అనంతరం ఎస్ఈసీ దంపతులకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి లడ్డూ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.