ములుగు : కరోనా ఉధృతి దృష్ట్యా మేడారం పూజారులు కీలకం నిర్ణయం తీసుకున్నారు. మేడారం సమ్మక్క – సారలమ్మ దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మే 1 నుంచి 15వ తేదీ వరకు ఈ నిబంధన అమల్లో ఉంటుందని పూజారులు స్పష్టం చేశారు.
మేడారం మహా జాతర తేదీలను పూజారులు ఖరారు చేశారు. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క – సారలమ్మను జాతరను నిర్వహించనున్నారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో గల ఆదివాసీ గిరిజన దైవాలు శ్రీ మేడారం సమ్మక్క-సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సాంప్రదాయ ప్రకారం మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరం నిర్వహించే జాతర తేదీలను పూజారులు నిర్ధారించారు. 2022, ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్నట్లు ఆదివారం మేడారంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పూజారులు తెలిపారు.
ఇవికూడా చదవండి..