బడంగ్పేట: మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని 10వడివిజన్ కార్పొరేటర్ ముద్ద పవన్కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు సిఐ మహేందర్రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి ఆర్ఎన్రెడ్డినగర్లోని విద్యావాణి స్కూల్లో డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, మేయర్ భర్త దీప్లాల్ హన్, కార్పొరేటర్స్ వేముల నర్సింహ, అనిల్కుమార్ యాదవ్, సిద్దాల బీరప్ప, ఇంద్రావత్ రవినాయక్ సమావేశం దగ్గరకు వచ్చి అకారణంగా కర్రలు, హకీబ్యాట్స్తో దాడి చేశారని కార్పొరేటర్ సౌందర్య విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని సిఐ తెలిపారు.
ముద్ద పవన్కుమార్, అజయ్కుమార్రెడ్డి, ప్రతాప్, హరీప్, పాష, అనిల్, శేష్, బత్కర్, వికాష్, వేముల విజయ్, యోగేష్, ప్రమోద్,శివ, సాయి, మనోజ్ తదితరులు దాడి చేశారని ఫిర్యాదు అందిందన్నారు. దీంతో వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఐపీసీ ఆర్/డబ్ల్యూ149,ఐపిసి అండ్ సెక్షన్3(1)(ఆర్) (ఎస్) అండ్ 3(2)(విఎ)అండ్ 3(1) (డబ్ల్యూ) (ఐ) ఆప్ ఎస్సీ, ఎస్టీ, (పిఓఎ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు.