రవీంద్రభారతి,ఆగస్టు 18 : సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ సేవలు చిరస్మణీయని ఎక్సెంజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రవీంద్రభారతిలో భాషా సంస్కృతిక ఆధ్వర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ 371 జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పాపన్నగౌడ్ బహూజన రాజ్యం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన గొప్ప మహానీయుడని కొనియాడారు.
ఆయన నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యన్నతికి కృషి చేసి తన జీవితాన్నే ప్రజల కోసం అంకింతం చేసారని కొనియాడారు. ఆయన బాటలో బహునులు,గౌడ్ కులస్థులు నడువాలని సూచించారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొన్ని న్యూస్ ఛానల్లు, అగ్రకుల నాయకులు నాపై విషం చిమ్ముతున్నారని, అలాంటి ఛానల్స్కు, వారికి గౌడ్ కులస్థులు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
పాపన్నగౌడ్ను కూడా భూస్వాములు ఆయన ప్రజలకు చేస్తున్న సేవలను చూసి ఓర్వలేక అంతం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు.నే టి యువత పాపన్నగౌడ్ను ఆదర్శంగా తీసుకుని రాజకీయంగా,ఆర్ధికంగా ఎదగాలనిప్రతిక్కరూ చదువుకొని రాణించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాష్గౌడ్, వివేక్గౌడ్, నాగేందర్గౌడ్, మాజీ మంత్రి రాజేశంగౌడ్, పల్లె లక్ష్మన్గౌడ్, బాల్రాజ్గౌడ్, వి.రామారావుగౌడ్, అంబాల నారాయణగౌడ్, నర్సాగౌడ్, ఐ.వెంకన్నగౌడ్, వేములయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.