బంజారాహిల్స్, సెప్టెంబర్ 1: పేద విద్యార్థులకు ప్రముఖ నటుడు సోనూసూద్ తన తల్లి పేరుతో ప్రకటించిన ‘సరోజా సూద్ స్కాలర్షిప్స్’ను అందిస్తున్నామని సిటీ యూనివర్సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మన్బీర్ సింగ్, వైస్ చాన్స్లర్ డా.హర్ష సదావర్తి తెలిపారు. ఎర్రమంజిల్లోని మెర్క్యూర్ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన వారు మాట్లాడు తూ ప్రతిభ కలిగిన విద్యార్థులు ఎవరూ ఉన్నత విద్యకు దూరం కావద్దనే ఉద్దేశంతో సోనూసూద్ ప్రారంభించిన స్కాలర్షిప్స్ను తమ యూనివర్సిటీ ద్వారా అందించే అవకాశం కలగడం ఆనందంగా ఉందన్నారు. తమ యూనివర్సిటీలో చదువుకునే అన్ని కోర్సులకు ఈ స్కాలర్షిప్ వర్తిస్తుందన్నారు. సిటీ యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్స్, బీసీఏ, ఎంబీఏ కోర్సులతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్, నెట్వర్కింగ్ తదితర ప్రోగ్రామ్స్లో కోర్సులు అందిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయని వివరించారు.