అమీర్పేట్: సనత్నగర్ హనుమాన్ దేవాలయంలో బుధవారం సంకటహర చతుర్థి పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామున ఆరుగంటలకు ఆలయ ఆవరణలో సంకటహర గణపతి హోమం జరిగింది. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు.
సాయంత్రం 6 గంటలకు ప్రదోషకాలంలో స్వామి వారికి అభిషేకంతో పాటు అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గణపతి దేవాలయ అర్చకులు కందాడయ్ వెంకటేష్తో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.