హైదారాబాద్ : చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా నిలిచిన సాలార్జంగ్ మ్యూజియం గొప్ప అనుభూతులను అందించిందని మద్యప్రదేశ్ వైద్యవిద్యా శాఖ మంత్రి కైలాష్ సారంగ్ తెలిపారు. గురువారం నగరానికి విచ్చేసిన ఆయన సాలార్జంగ్ మ్యూజియాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మ్యూజియంలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి కైలాష్ సారంగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పర్యటనలో మరపులేని అనుభూతులను సాలార్జంగ్ మ్యూజియం అందించిందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన కళలను నగరంలో సందర్శించే అవకాశాన్ని మ్యూజియం కల్పించిందన్నారు. మ్యూజియాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు అనేక దేశాల సంస్కృతులను తెలుసుకోవచ్చని తెలిపారు. మంత్రి కైలాష్ సారంగ్కు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డి జ్ఞాపికను అందించారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?