, మార్చి 4 : కరోనా నివారణ వ్యాక్సిన్పై అపోహలు వద్దని, అర్హులందరూ టీకా వేసుకోవాలని ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ రాజేశం అ న్నారు. మండలంలోని గిన్నేధరి గోండ్వానా రా యి సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ కనక యాదవ్రావుతో కలిసి మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయ
న మాట్లాడుతూ రోజురోజుకూ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో గిరిజనులకు సర్మేడీలు, ఆదివాసీ సం ఘాల నాయకులు అవగాహన కల్పించి టీకా వేసుకునేలా చూడాలన్నారు. నెట్వర్క్ లేని గ్రామాలు అలాగే నిరాక్షరాస్యులకు అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తేనే వైరస్ నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆదివాసీ సంఘాల నాయకులు అదనపు కలెక్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్, డీటీడీవో మణెమ్మ, అదనపు డీఎంహెచ్వో సుధాకర్ నాయక్, ఎంపీపి మర్సుకోల శ్రీదేవి, తహసీల్దార్ మల్లికార్జున్, వైద్యశాలల పర్యవేక్షకుడు శ్యాంకుమార్, ఎస్ఐ రామారావు, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు మడావి గుణవంతరావు, గిన్నేధరి సర్పంచ్ కోవ అర్చన, పెసా యాక్టు కోఆర్డినేటర్ వసంతరావు, జిల్లా సర్మేడి యశ్వంత్రావు, కుర్సెంగ మోతీరాం ఆయా ఆదివాసీ సంఘాల నాయకులు, ఆయా శాఖల సిబ్బంది, తదితరులు ఉన్నారు.