తిరుమల,జూలై:లోక కళ్యాణం కోసం కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టిటిడి చేపట్టిన రామయంణంలోని యుద్ధకాండ పారాయణం రేపటితో ముగియనున్నది. వసంత మండపంలో శ్లోక పారాయణంతోపాటు ధర్మగిరి వేద పాఠశాలలో మరో 16 మంది ఉపాసకులు 16 రోజుల పాటు జప,హోమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
“సకృదేవ ప్రపన్నాయత వాస్మీతి చయాచతే అభయం సర్వభూతేభ్యః దదామ్యే తద్వ్రతం మమ ” మహామంత్రం ప్రకారం యుద్ధకాండలోని మొత్తం131 సర్గలలో 5783 శ్లోకాలను 16 మంది ఉపాసకులు అత్యంత దీక్షా శ్రద్ధలతో పారాయణం చేస్తున్నారు.