బడంగ్పేట, జూన్ 6 : ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ఫరిధిలోని నందిహిల్స్ 9వ డివిజన్లో రూ.63.50 లక్షలతో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంపు సమస్యను పరిష్కరించేందుకు రూ. 26 కోట్లు ఖర్చు అవుతున్నట్లు సీఎం దృష్టికి తీసుకుపోగా.. స్పందించిన ఆయన వెంటనే నిధులు కేటాయించేందుకు సముఖత చూపారని అన్నారు. 50 సంవత్సరాల వరకు మంచి నీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ సరిహద్దులో ఉన్న కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తెలిపారు. విజ్ఞాన్పురి కాలనీలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి , కార్పొరేటర్, మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షురాలు సిద్దాల లావణ్యబీరప్ప, కార్పొరేటర్లు శివపార్వతినర్సింహ, అర్కల భూపాల్రెడ్డి, పెండ్యాల నర్సింహ, 9వ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు నర్సిరెడ్డి ఉన్నారు.