హైదరాబాద్ : సికింద్రాబాద్ తాడ్బండ్ కూడలి వద్ద గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి కార్లపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు బస్సు డ్రైవర్ తెలిపాడు. బస్సు డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే.. ప్రమాదం జరిగినట్లు ప్రయాణికులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.