మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్
మహబూబ్నగర్ టౌన్, ఏప్రిల్ 30 : హరితహారంలో నాటిన ప్రతి మొక్క నూ సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్ అన్నారు. శుక్రవా రం వాటరింగ్డేను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో మొక్కలకు ఆయన నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరేండ్లుగా హరితహారం కార్యక్రమం నిర్వహించి మొక్కలు నాటిస్తుందని తెలిపా రు. ప్రకృతి వనాలు, నర్సరీలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిఒ క్కరూ ఇంటి ముందు ఖాళీ స్థలాలు ఉ ంటే మొక్కలు నాటి వాటిని సంరక్షిచాలన్నారు. అలాగే వాటరింగ్ డే సందర్భంగా ఆయా వార్డుల్లో ప్రత్యేక అధికారులు, కౌన్సిలర్లు మొక్కలకు నీళ్లు పోశారు.