హైదరాబాద్: నగరంలోని రాయదుర్గంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రాయదుర్గంలోని టెలికాంనగర్లో ఉన్న ఓ ఇంట్లో రూ.10 లక్షలు, 110 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని శ్రీశైలానికి వెళ్లినప్పుడు ఈ చోరీకి పాల్పడ్డారు. గుర్తించిన ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నేపాల్కు చెందిన వాచ్మెన్ దంపతులపై అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాచ్మెన్ దంపతుల కోసం గాలిస్తున్నారు.