హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ మహిళా ప్రయాణికురాలు.. కదులుతున్న రైలు ఎక్కబోతుండగా జారి కిందపడింది. అక్కడే ఉన్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ అప్రమత్తమై ఆ మహిళ ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ దినేష్ సింగ్పై ఉన్నతాధికారులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధిత మహిళను నసీమా బేగంగా పోలీసులు గుర్తించారు.