హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం అర్ధరాత్రి దుండగులు హత్యచేశారు. పాతబస్తీ బహదూర్పురా సమీపంలోని కిషన్బాగ్లో రౌడీషీటర్ ఐజాజ్ని ఇనుప రాడ్లతో కొట్టి, బండరాళ్లతో మోది హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఉస్మానియా దవాఖాన మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి