చిక్కడపల్లి :గాంధీననగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో నూతన రోడ్ల నిర్మాణ పనులు పూర్తి కావడంతో కొత్తకళ వచ్చింది. ముఖ్యంగా గాంధీనగర్ డివిజన్ లోని హెబ్రోన్ చర్చి నుంచి వై జంక్షన్ వరకు రూ.49.50 లక్షల వ్యయంతో నూతన వీడీసీసీ రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. అదే విధంగా వై జంక్షన్ నుంచి ఆంధ్రకేఫ్ వరకు 35 లక్షల రూపాయిలతో రోడ్డు పనులు పూర్తి కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్లు గుంతల మయం కావడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. గత 20 సంవత్సరాల నుంచి ఎవ్వరూ పట్టించుకోలేదని స్థానికులు చేబుతున్నారు. ప్రభుత్వం డివిజన్ల అభివృద్ధిలో భాగంగా కోట్ల రూపాయిల నిధులు మంజూరు చేయడంతో పనులు పూర్తి అయ్యయి.
అభివృద్ధి పనులు వేగంగా పూర్తి
అభివృద్ది పనులు నిర్ణీత కాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా నూతన రోడ్ల పై ప్రత్యేక దృష్టి సారించాము. నూతన రోడ్లతో పాటు నూతన డ్రైనేజీ పైప్లైన్ పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తున్నాము. అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. నిర్ణీతకాలంలో పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.- ఎమ్మెల్యే ముఠా గోపాల్
తెలంగాణలోనే అభివృద్ధి
గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు.కానీ తెలంగాణ ప్రభుత్వంలోనే రోడ్ల అభివృద్ధి కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా ఈ రోడ్లను ఎవ్వరూ పట్టించు కోలేదు. కానీ తెలంగాణ వచ్చాక పనులు పూర్తి కావడం చాలా సంతోషంగా ఉంది.- ఇ. సాయి, స్థానికుడు న్యాయవాది.