జహీరాబాద్, ఏప్రిల్ 8 : వర్షపు నీటిని నిల్వ చేసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం వాగులపై చెక్డ్యాంలు నిర్మాణానికిప్రతిపాదనలు సిద్ధం చేసింది. జహీరాబాద్ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉండడం, వర్షపు నీటిని నిల్వ చేసేందుకు భారీ ప్రాజెక్టులు లేవు. దీంతో జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో కురిసిన వర్షంనీరు కర్ణాటక వైపు పరుగులు తీస్తున్నది. వర్షంనీరు నిల్వ లేక భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వాగులు, కాల్వలపై రూ.12 కోట్లతో చెక్డ్యాంలు నిర్మించేందుకు సర్వే చేసింది. నీటివనరులశాఖ అధికారులు స్థలాన్ని గుర్తించి, అనుమతి కోసం ప్రభుత్వానికి పంపించారు. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ చెక్డ్యాంల నిర్మాణానికి కృషి చేస్తున్నారు. కోహీర్ మం డలం గోటిగార్పల్లి గ్రామ శివారు నుంచి ప్రవహిస్తున్న పెద్దవాగుపై జాడిమాల్కాపూర్ శివారులో రూ.2 కోట్లతో చెక్డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాడిమాల్కాపూర్ చెక్డ్యాం నిర్మాణంతో 560 ఎకరాలకు మేలు జరుగనున్నది. జహీరాబాద్, న్యాల్కల్ మండలాల్లో వాగులపై 10 చెక్డ్యాంలు నిర్మించనున్నారు. దీంతో 11 వేల ఎకరాలకు మేలు కలుగుతుందని నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారులు తెలుపుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణం చేస్తున్నది.
పెద్దవాగుపై జాడిమాల్కాపూర్ శివారులో చెక్డ్యాం నిర్మాణం
పెద్దవాగు నుంచి ఏటా కర్ణాటక వైపు వరద నీరు ప్రవహిస్తున్నది. వరద నీటిని నిల్వ చేసి, వ్యవసాయానికి సాగునీరు అందించే లక్ష్యంతో చెక్డ్యాంలు నిర్మించేందుకు నీటిపారుల శాఖ అధికారులు సర్వే చేశారు. భూగర్భ జలాలు పెరిగి 560 ఎకరాలకు వ్యవసాయ బావులు, బోరుల ద్వారా మేలు కలుగుతుందని అధికారులు అంచనా వేశారు. రెండు గట్ల మధ్య చెక్డ్యాం నిర్మాణం చేయడంతో భారీగా వరద నీరు నిల్వ ఉండే అవకాశం ఉంది. చెక్డ్యాంల నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించగా అనుమతి ఇచ్చింది. టెక్నికల్ అనుమతి రాగానే టెండర్లు వేసి పనులు ప్రారం భించేందుకు నీటిపారుద శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జాడిమాల్కాపూర్ శివారులో చెక్డ్యాం నిర్మాణంతో మల్చల్మా, గోటిగార్పల్లి, జాడిమాల్కాపూర్, సజ్జారావుపేట తండాతో పాటు కర్ణాటకలోని వెంకటపూర్, సంగాపూర్తండాతో పాటు పలు గ్రామాల్లో భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. వ్యవసాయ బావులు, బోరులు, తాగునీటి బోరులో పుష్కలంగా నీరు వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు సర్వే నివేదికలో తెలిపారు.
నారింజ ప్రాజెక్టు వాగుపై నాలుగు చెక్డ్యాంలు
నారింజ వాగుపై వరద నీటిని నిల్వ చేసేందుకు బుర్థిపాడు, బుచినెల్లి, సత్వార్, చెరాగ్పల్లి శివారులో చెక్డ్యాంలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించారు. ఒక చెక్డ్యాంను నిర్మా ణం చేపట్టేందుకు రూ.కోటితో నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి పంటల సాగు పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. జహీరాబాద్ మండలంలో రైతులు వ్యవసాయ బోరులు, బావుల ద్వారా పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ సరఫరా చేయడంతో పాటు భూగర్భ జలాలు పెరిగేందుకు చెక్డ్యాంలు నిర్మాణం చేయడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతున్నది. వచ్చే వానకాలం వరకు చెక్డ్యాంల నిర్మాణం పూర్తి చేసేందుకు అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.
న్యాల్కల్లో మండలంలో చినిగేపల్లి వాగుపై చెక్డ్యాంల నిర్మాణానికి సర్వే
న్యాల్కల్ మండలంలోని చినిగేపల్లిలో వాగుపై చెక్డ్యాంల నిర్మాణానికి నీటిపారుదల శాఖ అధికారులు సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. చినిగేపల్లి, చికూర్తి, హుమ్నాపూర్, గ్రామాల్లో చెక్డ్యాంలు నిర్మాణం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. చినిగేపల్లి వాగు నుంచి వరదనీరు మంజీర నదిలోకి వెళ్తున్నది. ఝరాసంగం వాగుపై భారీ చెక్డ్యాం నిర్మాణం చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా, జహీరాబాద్ మండలంలోని మల్చల్మా శివారులో పెద్ద వాగుపై చెక్డ్యాం నిర్మాణం చేసేందుకు సర్వే చేశారు.
చెక్డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు
జహీరాబాద్, న్యాల్కల్, మొగుడంపల్లి, ఝరాసంగం మండలాల్లో చెక్డ్యాంలు నిర్మించేందుకు సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జాడిమాల్కాపూర్ శివారులో చెక్డ్యాం నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టెక్నికల్ అనుమతి రాగానే టెండర్లు వేసి పనులు ప్రారంభిస్తాం. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగే ఆవకాశం ఉంది. వరదనీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, సర్వే చేసి నివేదిక పంపించాం. ప్రభుత్వ అనుమతి రాగానే చెక్డ్యాంల నిర్మాణం చేపడుతాం.
-సుబ్రహ్మణ్యం ప్రసాద్, ఈఈ నీటివనరుల శాఖ జహీరాబాద్
భూగర్భ జలాలు పెంపొందించేందుకే..
జహీరాబాద్ నియోజకవర్గంలో పెద్దనీటి వనరులు లేకపోవడంతో రైతులు వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. రూ.12 కోట్ల తో చెక్డ్యాంలు నిర్మాణం చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జాడిమాల్కాపూర్ చెక్డ్యాం నిర్మాణానికి ప్రభు త్వం అనుమతి ఇచ్చింది. టెక్నికల్ అనుమతి రాగానే చెక్డ్యాం నిర్మించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి రైతులకు మేలు కలుగుతున్నది. చెక్డ్యాంల నిర్మాణంతో 11 వేల ఎకరాలకు మేలు జరుగనున్నది.
-కొనింటి మాణిక్రావు, ఎమ్మెల్యే జహీరాబాద్