అబ్దుల్లాపూర్మెట్, మార్చి 23 : ఔటర్ రింగ్రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… అతివేగంగా వస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులతోపాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు నుజ్జునుజ్జు అయింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్నది. ఇన్స్పెక్టర్ స్వామి వివరాల ప్రకారం.. హైదరాబాద్ సరూర్నగర్కు చెందిన తండ్రి ఉపేంద్రనాథ్(45), కొడుకు రోషిక్(27)లు డ్రైవర్ ప్రభాకర్(30)తో కలిసి కారు ( ఏపీ 11ఎఆర్8739)లో సోమవారం హైదరాబాద్ నుంచి గుంటూరు పొన్నూరుకు పని నిమిత్తం వెళ్లారు. తిరిగి హైదరాబాద్కు వస్తుండగా మంగళవారం ఉదయం పెద్దఅంబర్పేట ఔటర్ రింగ్రోడ్డు వద్ద (ఏపీ 07వై4599) ఆగి ఉన్న లారీని ఢీకొట్టారు.. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఉపేంద్రనాథ్, రోషిక్, డ్రైవర్ ప్రభాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జు నుైజ్జెంది. కారులో ఇరుక్కుపోయిన మృత దేహాలను పోలీసులు, స్థానికులు తీవ్రంగా శ్రమించి వెలికి తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.