న్యూఢిల్లీ, మే 31: భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2021-22)గాను టాటా స్టీల్ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ ఎన్నికయ్యారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో, ఎండీ ఉదయ్ కొటక్ నుంచి ఆయన ఈ బాధ్యతల్ని స్వీకరించారు. ఈ మేరకు సోమవారం సీఐఐ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదిలావుంటే హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజల్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక బజాజ్ ఫిన్ సర్వ్ చైర్మన్, ఎండీ సంజీవ్ బజాజ్ 2021-22లో సీఐఐ గౌరవాధ్యక్షుడిగా ఉంటారు.