గత సం వత్సరం నుంచి పట్టి పీడిస్తున్న కరోనా వల్ల ప్రపంచం యావత్తు ఛిన్నాభిన్నమైంది. ఎన్నో దేశాలు, పలు ఉపాధి రంగాలు, ఆర్థిక సంస్థలు కొవిడ్ వైరస్ విపత్తుకు నిలబడ లేకపోయాయి. కొత్త దశాబ్దానికి సరికొత్త ప్రారంభ సంవ త్సరమైన 2020 ఎన్నో అటుపోట్లను ఎదుర్కొని, గుణ పాఠాలను సైతం నేర్చుకొనేలా చేసి, ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసేలా చేసింది. కరోనా మహమ్మారి రూ పంలో వచ్చిన విపత్తు యావత్ ప్రపంచాన్నే ఒక కుదుపు కుదుపేసింది. అందులో భారతదేశం సైతం ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. గతేడాది మొదటి త్రైమాసి కంలోనే కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం.., అందులోనూ హౌసింగ్ విభా గం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కరోనా లాక్డౌన్ తర్వాత క్రమంగా రియల్ ఎస్టేట్ వేగంగానే పుంజుకుం ది. తాజాగా, 2021 త్రైమాసికంలో రియల్ ఎస్టేట్ రం గం మంచి ఊపు మీదే ఉందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ‘ఆన్రాక్’ తన అధ్యయనంలో పేర్కొంది.
కరోనా తర్వాత కొత్త ప్రాజెక్టులు బాగా పెరిగాయని, ప్రధానంగా దేశంలోని ఏడు పట్టణాల్లో 2021 త్రైమా సికంలో 62130 యూనిట్లు ప్రారంభమై సరికొత్త రికా ర్డును సృష్టించినట్లు వెల్లడించింది. ఇది గతేడాదిలోని త్రైమాసికం కంటే 18 శాతం అధికమని, అదే విధంగా ఏడాదితో పోల్చితే 51 శాతం అధికమని పేర్కొన్నారు. ఇళ్ల అమ్మకాలు సైతం బాగా పెరిగాయని, ఇందులో 58, 290 యూనిట్లు ఉన్నాయని, ఇది త్రైమాసికంలో పోల్చితే 15 శాతం అధికం కాగా, ఏడాదితో పోల్చితే 29 శాతం అధికమని ఆన్రాక్ నివేదికలో పేర్కొన్నారు. కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు ఎంతో అనుకూలమని, అందుకే 57 శాతం మంది ఇందులోనే పెట్టుబడిగా పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారని ఆన్రాక్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది.
గతేడాది మార్చి నుంచి మొదలైన కొవిడ్-19 మహ మ్మారి నేపథ్యంలోనూ ఏడు నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగంలో వృద్ధి రేటు గతేడాది త్రైమాసికంతో పోల్చితే 15 శాతం అధికంగా నమోదైంది. జాబితాలో ఉన్న ఏడు నగరాల్లో మొత్తంగా 10 నుంచి 23 శాతం ఉంది. ఇందులో హైదరాబాద్లో అయితే త్రైమాసికంగా చూస్తే 23 శాతం, ఏడాది మొత్తంలో జరిగే అమ్మకాలతో పోల్చితే 64 శాతం పెరుగుదల ఉందని ఆన్రాక్ నివేదికలో వెల్లడించారు.