సికింద్రాబాద్/మల్కాజిగిరి/వినాయక్నగర్, జూలై 27: పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. మంగళవారం సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో కొత్త రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి బాలకృష్ణ, కార్పొరేటర్లు, నేతలు కిశోర్గౌడ్, కిరణ్కుమార్ గౌడ్, రామేశ్వర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కార్డును అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. రాష్ట్రంలో జరిగినంత అభివృద్ధి, సంక్షేమం ఇతర ఏ రాష్ర్టాల్లో జరగలేదన్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని మచ్చబొల్లారం, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లోని బీజేఆర్నగర్లో మంగళవారం నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు.
కార్యక్రమంలో ఎస్ఓ సరస్వతి, తాసీల్దార్లు వినయలత, నాగమణి, డిప్యూటీ కమిషనర్ నాగమణి, కార్పొరేటర్లు ప్రేంకుమార్, సునీత , క్యానం రాజ్యలక్ష్మి, రాజ్ జితేంద్రనాథ్, శాంతి శ్రీనివాస్రెడ్డి, సబితా , టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.