కందుకూరు, మార్చి : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ అడ్రసు గల్లంతవడం ఖాయమని రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఓటు వేసిన అనంతరం మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మీ సురేందర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలువడానికి ప్రభుత్వంపై అర్థంలేని ఆరోపణలు చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలను పెంచి పేదల నడ్డి విరిచిందన్నారు. పేద ప్రజలను మోసం చేస్తున్న బీజేపీని ప్రజలు ఎలా నమ్ముతారని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి గుణపాఠం చెబుతాయని వివరించారు.
రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతి పక్షాల పార్టీల నాయకుల్లో భయం పుడుతుందని తెలిపారు. ప్రభుత్వంపై చేసిన విమర్శలు పట్టభద్రులు నమ్మలేదని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మరో పదేండ్ల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని తెలిపారు. అప్పటి వరకు ప్రతి పక్షాల నాయకులు పగటి కలలు కనాలని జోస్యం చెప్పారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మండలాధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు కాకి దశరథ, కుర్నమోని జయేందర్ ముదిరాజ్, పొలెమోని అశోక్ ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్రెడ్డి, జిట్టె రాజేందర్రెడ్డి, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్ల కార్తీక్, శ్రీహరి, సర్పంచ్ ఈర్లపల్లి భూపాల్రెడ్డి, సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్రెడ్డి, ప్రశాంత్చారి బర్కం వెంకటేశ్, పాండురంగారెడ్డి, టంకరి ఉమాకాంత్రెడ్డి, కల్లెం సదానంద్గౌడ్ పాల్గొన్నారు.